calender_icon.png 29 June, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

29-06-2025 11:13:15 AM

బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మొరంపూడి అప్పారావు

ములకలపల్లి,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసగూడెం సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ వద్ద సోమవారం తలపెట్టిన బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ములకలపల్లి మండలం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, అశ్వరావుపేట  నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జి  మెచ్చ నాగేశ్వరావు  పిలుపు చలో పూసుగూడెం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.  సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాలోని పంట పొలాలకు నీరందించాలని చేపట్టిన నిరసన కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, రైతు సోదరులు అందరూ అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున బయలుదేరి ఉదయం 10 గంటల కల్లా  పూసుగూడెం గ్రామానికి చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.