29-06-2025 11:07:54 AM
ఇటీవల ఇంట్లో పడ్డ దొంగ ను పట్టుకున్న పోలీసులు
దొంగిలించిన టీవీ, వెండి వస్తువులు స్వాధీనం
మంథని పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో సిఐ రాజు
మంథని,(విజయక్రాంతి): మంథనిలో దొంగలకు మంథని పోలీసులు చెక్ పెడుతున్నారు. మంథని పట్టణంలో ఇటివల దొంగతనం చేసిన దొంగను పట్టుకొని అరెస్ట్ చేసినట్లు మంథని సీఐ రాజు తెలిపారు. మంథని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ ఈ నెల మంథని పట్టణానికి చెందిన ఇల్లెందుల వెంకటేశ్వర్లు (48) పని నిమిత్తం ఇంటికి తాళం వేసి తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ కు వెళ్ళారు. 24 తేదీన తిరిగి ఇంటికి వచ్చిన ఇంటి యజమాని చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండి ఇంట్లో ఉన్న టీవీ, ల్యాప్ టాప్, ట్యాబ్, వెండి వస్తువులు రూ.20 వేలు గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లినారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదే క్రమంలో మంథని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు కేసు పరిశోధనలో భాగంగా సీసీ కెమెరాల ద్వారా కేసును చేధించారు. మంథని పట్టణానికి చెందిన తిరునహరి రాజ నర్సింహస్వామి అలియాస్ రాజు (41)ను అరెస్టు చేసి టీవీ, వెండి వస్తువులను స్వాధీన పరచుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును ప్రత్యేక చొరవ తీసుకొని చాలా చాకచక్కంగా వ్యవహరించిన మంథని ఎస్ఐ డేగ రమేష్ ను, రామగిరి ఏఎస్ఐ స్వామి, కానిస్టేబుళ్లు దుబాసి రమేష్, రాజ్ కుమార్, శివ, అశోక్ లను సిఐ ప్రత్యేకంగా అభినందించారు.