23-06-2025 05:16:37 PM
ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): ఇల్లందు మండలం బాలాజీ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 6 గ్యారంటీలో ప్రజలను మోసం చేసే విధానంపై గ్రామపంచాయతీలో మెమోరండం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షుడు కుక్కముడి మహేష్ ఆధ్వర్యంలో సోమవారం పంచాయతీలో ఉన్నటువంటి సమస్యల గురించి గ్రామ కార్యదర్శికి సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఘాజి, సోషల్ మీడియా ఇంచార్జ్ నారపాక యాకయ్య, నల్లమల్ల శంకర్, లౌక్య, నాగారపు రాములు, మహిళలు స్నేహ, బేబీ, ప్రియాంక, విజయ తదితరులు పాల్గొన్నారు.