23-06-2025 05:21:59 PM
పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించిన టిఆర్ఎస్ నేతలు..
వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ(TRS Party Mandal Committee) ఆరోపించింది. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు వారికి సంబంధించిన వ్యక్తులకి ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్త వైరస్ పార్టీ పిలుపులో భాగంగా వెంకటాపురం మండల కేంద్రంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి ఇందిరమైన ఎంపికపై మెమోరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప రాంబాబు మాట్లాడుతూ... ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లా లబ్ధిదారుల్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని, డాబా ఉన్న వాళ్లకి, భూములు ఉన్నవాళ్లకి ఇల్లు కేటాయించడం జరిగిందని ఆరోపించారు. ఈ మధ్యకాలంలో కలెక్టర్ మాట ఇచ్చినట్టు అనర్హులకు ఇల్లు ఇచ్చినట్లయితే మా దృష్టికి తీసుకురండి గంట లోపల ఆ ఇల్లు తీసేసి అర్హులైన వాళ్లకి ఇల్లు కేటాయిస్తామని మాట ఇచ్చిన పరంగా మాట మీద కట్టుబడి ఉండి వెంకటాపురం మండలంలో 341 ఇళ్లల్లో సుమారు 240 మందికి ఇల్లు అక్రమంగా కేటాయించినట్లు తెలియజేశారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో ఇందిరమ్మ కమిటీల పేరున అనర్హులకు కాంగ్రెస్ కార్యకర్తలను ఎంపిక చేశారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి పరిశీలించి సూచించిన వాళ్లకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని, నిజమైన పూరి గుడిసెల్లో బరకాలు కట్టుకుని నివసిస్తున్నటువంటి అర్హులకు ఇల్లు కేటాయించాలని సూచించారు. లేనియెడల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు చేపట్టి అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇచ్చేంతవరకు పోరాడుతూనే ఉంటామని ప్రభుత్వానికి గుర్తు చేశారు. వర్షాకాలం ప్రారంభమవుతుంది గనక వీధిలైట్లు లేని ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలని, గ్రామ పంచాయతీ బావులలో బ్లీచింగ్ పౌడర్ వేసేలా తక్షణమే అన్ని గ్రామ పంచాయతీలకు ఆదేశాల జారీ చేసి, శానిటేషన్ పనులు పూర్తిచేయాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంప రాంబాబు, మండల అధికార ప్రతినిధి డర్ర దామోదర్, సీనియర్ నాయకులు వేల్పూరి లక్ష్మీనారాయణ, ముడుంబా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర శివాజీ యాదవ్, మాజీ సర్పంచ్ పూనెం శ్రీదేవి, శాంతమూర్తి యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు చిట్టిబాబు, మాజీ వార్డు సభ్యులు కిరణ్, మహిళా అధ్యక్షురాలు పెనుమత్స మాధురి, మాజీ అధ్యక్షురాలు జానకమ్మ, ఆదినారాయణ, ఏడుకొండలు, సాంబశివరావు, రాజేష్, మోహన్ రావు, మల్లికార్జున, రవి, తదితరులు పాల్గొన్నారు.