వనపర్తి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు ఓటు వేసి గెలిపించాలని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన శ్రీరంగాపురం మండలంలోని నాగసానిపల్లి, వెంకటాపూర్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ప్రచారంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకటస్వామి ఉన్నారు.