రజకసంఘ, మున్నూరుకాపు సంఘ కులస్తులు కాంగ్రెస్ తీర్థం
కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, ఏప్రిల్ 27 (విజయక్రాం తి): కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని భిక్కనూరు మండలంలో కాంగ్రెస్లో భారీగా చేరికలు జరిగాయి. బస్వాపూర్ గ్రామానికి చెందిన రజకసంఘ, మున్నూరుకాపు సంఘ కులస్తులు కాంగ్రెస్ కండు వా కప్పుకున్నారు. శనివారం ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సురేష్ షెట్కార్ను భారీ మెజార్టీతో గెలుపిస్తామని వారు హామీ ఇచ్చారు. కాంగ్రెస్తోనే అభివృద్ది సాధ్యమవుతుందని అందుకే ఆ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనూ...
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్లో భారీగా చేరికల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి మండలం మత్మల్ గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, పద్మరావు కాంగ్రెస్లో చేరారు. అంతే కాకుం డా సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కొకొండ గ్రామ ముదిరాజ్ సంఘ నాయకులు రామానంద్, మాత్మల్ గ్రామ బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్కి రాజీనామా చేశారు. అనంతరం జైపాల్ రెడ్డి, జడ్పీటీసీ ఉషగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా సమక్షంలో ఎల్లారెడ్డి ఎమ్మె ల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. ఎల్లారెడ్డిలో మదన్ మోహ న్ చేస్తున్న అభివృద్దికి ఆకర్షితులై కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ కండు వా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే మదన్మోహన్ నేతలను ఆహ్వనించారు.