23 March, 2026 | 7:51 PM

అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్

23-03-2026 02:52 PM

హైదరాబాద్: పదవీ విరమణ ప్రయోజనాలు, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాల (DA) చెల్లింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంలో విఫలమైందంటూ నిరసన వ్యక్తం చేస్తూ భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) అసెంబ్లీ నుండి వాకౌట్ చేసింది. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులపై ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై కూడా  బీఆర్ఎస్ సభలో నిరసన తెలిపింది. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో, ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతుల్లో భారీ కుంభకోణం జరిగిందని హరీష్ రావు ఆరోపించారు.

కాకినాడ పోర్టులో గత ఏడాది కాలంగా నిల్వ ఉన్న 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వల స్థితిగతులపై ప్రభుత్వం నుండి ఆయన స్పష్టమైన సమాధానం కోరారు. బియ్యం ఎగుమతుల కోసం ముందస్తు చెల్లింపులు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఏఎఫ్ఈడీ(NAFED) తన సుముఖతను వ్యక్తం చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాంట్రాక్టును ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించిందని మాజీ మంత్రి ఆరోపించారు. అసలు టెండర్లు ఎందుకు పిలవలేదని, ఆ కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిలో అప్పగించారా? అని హరీశ్ రావు  ప్రశ్నించారు. 

హరీష్ రావు వ్యాఖ్యలకు బదులిస్తూ, సమితి సభ్యుడైన ఆయన అసత్యమైన, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతుల ఒప్పందంతో సదరు ప్రభుత్వ సలహాదారుకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితే, ఆ సలహాదారు నియామకానికి సంబంధించిన ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. పదవీ విరమణ ప్రయోజనాలు, పెండింగ్‌లో ఉన్న డీఏలను వీలైనంత త్వరగా అందజేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. తమ ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శాసనసభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్(BRS walks out) చేశారు.