17 March, 2026 | 1:27 PM

Breaking News

కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •   పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి   •   గవర్నర్ ప్రసంగం డొల్ల   •   ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి   •  

బుద్ధారం గండినీ టూరిజం హబ్‌గా మార్చుకుందాం

08-08-2024 04:48 PM

వనపర్తి: రానున్న కాలంలో గోపాల్ పేట మండలం బుద్ధారం గండి ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చుకుందామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘూరెడ్డి తెలిపారు. ఇప్పటికే బుద్ధారం గండిలో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు కోసం భూ సర్వే పూర్తయిందన్నారు. గురువారం గండి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం కమిటీ సభ్యులకు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘూరెడ్డి మాట్లాడుతూ.. గండి ఆంజనేయస్వామి ఆలయం రానున్న కాలంలో టూరిజం హబ్ గా మారబోతుందని అందుకు పర్యాటక శాఖ నుంచి ఇప్పటికే రూ.2 కోట్ల  ప్రతిపాదనలు వచ్చాయి.  త్వరలోనే ఇక్కడ హరిత హోటల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు