calender_icon.png 15 June, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నలుగురు కుర్రాళ్ల బడ్డీ కామెడీ మిత్ర మండలి

13-06-2025 12:00:00 AM

బన్నీ వాసు నూతన నిర్మాణ సంస్థ బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. కల్యాణ్ మంతిన, భానుప్రతాప, డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో సోషల్‌మీడియా ఫేమ్ నిహారిక ఎన్‌ఎం తెలుగు తెరకు పరిచయమవుతోంది.

వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేశ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఏర్పాటుచేసిన టీజర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నా మిత్రులందరూ కలిసి తీసిన ‘మిత్ర మండలి’ టీజర్‌ను లాంచ్ చేయడం బాధ్యతగా భావిస్తున్నా.

వీళ్లందరి మాటలు వింటుంటే.. దర్శకుడిలో ఎంతో ప్రతిభ ఉందని అర్థమవు తోంది. ప్రియదర్శి మాకు వెబ్‌సిరీస్ చేసినప్పుడే.. ఇతను మంచి స్థాయికి వెళ్తాడని అనిపించింది. నటుడిగా ఎంత చేయాలో తెలిసిన మనిషి. సోషల్ మీడియాలో నిహారికకు మంచి ఫాలోయింగ్ ఉంది. తనకు ఆల్ ది బెస్ట్. నిర్మాతలతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు.

మరో అతిథి, దర్శ కుడు అనుదీప్ కేవీ మాట్లాడుతూ.. “దర్శకుడు విజయ్ నాకు స్నేహితుడు. అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఈ స్టోరీ రెడీ చేసుకున్నాడు. రైటింగ్ క్రేజీగా ఉంటుంది. సినిమా మొదటి నుంచి చివరివరకు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు. ఇంకో అతిథి, నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ, “చేతి ఐదు వేళ్లు విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ, కలిసే ఉంటాయి. అల్లు అరవింద్ ప్రోత్సహించిన కుటుంబం మేము.

ఎప్పుడూ కలిసే ఉంటాం. ఆయన కోసం పిడికిలిగా మారడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. జాతిరత్నాలు, మ్యాడ్, ఆయ్, సింగిల్.. ఇవన్నీ హిట్ సినిమాలే. ‘మిత్రమండలి’ వాటిని మించిన విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. చిత్ర కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘విజయ్ లాంటి రచయితలు, దర్శకులు పరిశ్రమకు రావాలి’ అన్నారు. కథానాయిక నిహారిక మాట్లాడుతూ.. ‘ఇంత మంచి సినిమా నా మొదటి తెలుగు చిత్రం కావడం సంతోషంగా ఉంది.

ఇందులోని టాలెంటెడ్ యాక్టర్స్ నుంచి ఎంతో నేర్చుకున్నా’ అన్నారు. చిత్ర సమర్పకుడు, నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. “నలుగురు కుర్రాళ్లు కలిసి చేసే బడ్డీ కామెడీ ఎలా ఉంటుందో.. ‘మిత్రమండలి’ అలా ఉంటుంది. ఈ సినిమాకు ‘జాతిరత్నాలు’ స్ఫూర్తి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం.

థియేటర్లకు వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకోండి. అల్లు అరవింద్ మాకు గాడ్ ఫాదర్ లాంటివారు. సినీ పరిశ్రమలో నేను ఏం సాధించినా ఆయనే కారణం” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంంలో దర్శకుడు విజయేందర్ ఎస్, నిర్మాత భాను ప్రతాప పాల్గొన్నారు.