13-06-2025 12:00:00 AM
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న పాన్ఇండియా చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు నిర్మిస్తు న్న ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. “ఈ కథను ధనుష్ 20 నిమిషాలే విని వెంటనే సైన్ చేశారు.
ఆయన పాన్ ఇండియా స్టార్.. హిందీలోనూ సినిమాలు తీశారు. నాగార్జున కూడా ఎప్పట్నుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక ఇండియాలో పాపులర్ హీరోయిన్. కథకు అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్తో ఈ సినిమాను చేశాం. ఇది తెలుగు, తమిళ్ స్ట్రుటై మూవీ. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. -శేఖర్ మంచి భావోద్వేగాలతో ప్రేక్షక హృదయాలను టచ్ చేస్తూ ఫీల్ ఉండే సినిమాలను తీస్తారు.
ఇందులోనూ భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి. -మోస్ట్ రిచెస్ట్ మాన్ ఇన్ ది వరల్డ్, ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్స్.. ఇదే ‘కుబేర’ కాన్ఫ్ల్లిక్ట్. -ఈ సినిమా కోసం రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్లో తీశాం. అదే రియల్ ఛాలెంజ్. -సినిమాను చాలా గ్రాండ్గా దాదాపు 1600 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం.
నాగార్జున తన పాత్రలో ఆయన్ను తప్పితే మరొకరిని ఊహించలేనంత గొప్పగా నటించారు. దేవిశ్రీ చాలా డిఫరెంట్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చింది. ధనుష్ రెండు పాటలు పాడారు. శేఖర్ కమ్ములతో మరో సినిమా చేయనున్నాం. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు” అని తెలిపారు.