23-07-2025 07:20:03 PM
రూ.52974 వేల ఆదాయం
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం హుండీ లెక్కింపును బుధవారం ఆలయంలో నిర్వహించారు. ఆలయ హుండీ పర్యవేక్షణ అధికారి ముక్తారవి, కార్యనిర్వహణ అధికారి జి. బాబిరెడ్డి సమక్షంలో దేవాలయం హుండిలెక్కింపు జరిగింది. ఈ లెక్కింపును ఆలయానికి రూ.52974 వేల నగదు అధికారులు వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో దేవాలయం అర్చకులు శ్రీ రాంబట్ల వేణుగోపాల శర్మ, దేవాలయం సిబ్బంది పాల్గొన్నారు.