ఘనంగా కెప్టెన్ లక్ష్మీ సెహగల్ 12వ వర్ధంతి
మునగాల: కెప్టెన్ లక్ష్మి సెహగల్(Captain Lakshmi Sehgal) 12వ వర్ధంతి మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు షేక్ ఖాజాబీ.కామ్రేడ్ కెప్టెన్ లక్ష్మి సెహగల్ చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించి ఆవిడ మాట్లాడుతూ... ఆనాడు సుభాష్ చంద్రబోస్(Subhash Chandra Bose) సహచరిఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమంలో కడదాగ సాగిన వీర వనిత. అని కొనియాడారు. స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు దేశం కోసం నిలిచిన త్యాగధనులంతా ఎర్రజెండా పట్టి దేశ సేవకే సాగారు అందులో కామ్రేడ్ కెప్టెన్ లక్ష్మీసెగల్ ఒకరు. ఆమె వారసులు కూడా కమ్యూనిస్టు మార్క్ లిస్ట్ పార్టీలో ఉన్నారు. దేశానికి సిపిఎం పార్టీ మార్గదర్శన అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల కమిటీ సభ్యురాలు వెంపటి మైసమ్మ. మహిళా గ్రామ కమిటీ సభ్యులు బొల్లం శ్రీదేవి. దొడ్డి సుభద్ర. దైద జ్యోతి. షేక్ చాందిని. వీరమ్మ. ఖతిజాబేగం. సుల్తాన్ బి. కోడి రేణుక షేక్ కాజా. తదితరులు పాల్గొన్నారు.






