24-06-2025 03:24:44 PM
నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షులుగా చిల్కాపురం గ్రామం తిరుమలగిరి సాగర్ మండలం కు చెందిన బైరు రవి ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నికయ్యారు. ఈ నియామక పత్రం సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడైన డాక్టర్ చంటి ముదిరాజ్ బైరు రవి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా బైరు రవి మాట్లాడుతూ... నామీద నమ్మకంతో ఆర్టిఐ బాధ్యతలు అప్పగించినందుకు చంటి ముదిరాజ్ కి నా యొక్క నియామకానికి సహకరించిన జనరల్ సెక్రెటరీ సిద్ధం వెంకన్న కి కృతజ్ఞతలు తెలిపారు.