calender_icon.png 13 June, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతర నాటికి బస్ డిపో పూర్తవ్వాలి

13-06-2025 02:38:12 AM

  1. మారుమూల ప్రాంతాలన్నిటికి బస్సు సౌకర్యం 
  2. గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి సీతక్క

ఏటూరునాగారం, జూన్ 12 (విజయ క్రాంతి): మారుమూల గ్రామీణ ప్రాంతాలన్నింటికీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర పంచాయితి రాజ్ మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో రాష్ట్ర పంచాయితి రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, ఐటీడీఏ పిఓ చిత్ర మిశ్రా,ఏఎస్పి శివం ఉపాధ్యాయలతో కలిసి నాలుగు కోట్ల 20లక్షల రూపాయలతో చేపట్టనున్న నూతన బస్ డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశా రు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఏటూరునాగారంలో బస్ డిపో,50లక్షలతో మంగపేట మండలంలో చిన్న నూతన బస్టాండ్ నిర్మాణం,నూతన కలెక్టరేట్ వచ్చే వారి సౌకర్యార్థం ములుగు గట్టమ్మ ప్రాంతంలో బస్సు స్టాండ్ మంజూ రు చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మారుమూల ప్రాంతాలకు త్వరలోనే బస్సులు మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 

రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడం తోనే ఒక ప్రాంతం మారుమూల ప్రాంతం గా ఉంటుందని ఏ ప్రాంతాలకైతే ప్రధాన వ్యవస్థ మెరుగుగా ఉంటుందో ఆ ప్రాంతా లు త్వరగా అభివృద్ధి చెందుతాయని ములుగు ప్రాంతంలో నేషనల్ హైవే అందుబాటులోకి రావడం అదేవిధంగా మారు మూల ప్రాంతాలకు కూడా రవాణా సౌక ర్యం కల్పించడం ద్వారా ములుగు జిల్లా అతివేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

ప్రత్యేకంగా నేషనల్ హైవే కోసం 400 కోట్ల రూపాయలతో పసర సమీప నుంచి ఛత్తీస్ ఘడ్ బార్డర్ టేకులగూడెం వరకు మంజూ రు అయి ఉందని త్వరలోనే పూర్తిస్థాయిలో నేషనల్ హైవే అందుబాటులోకి వస్తుందని తెలిపారు.ములుగు జిల్లా కేంద్రానికి సుమా రు 30-40 కిలోమీటర్ల దూరంలో బస్సు డిపోలు ఉన్నాయని ఏటూరునాగారంలో బస్ డిపో ఏర్పాటు చేయడం ద్వారా ములుగుతో పాటు ఏటూరునాగారం చుట్టుపక్కల గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుందని అన్నారు.

మంజూరు అయి న బస్ డిపో,నూతన బస్టాండ్ నిర్మాణం మేడారం జాతర వరకు సిద్ధం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా ఘనంగా ప్రారంభోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని తద్వారా ప్రజల గుండెల్లో అధికారులు ప్రభుత్వం చేసిన మంచి పనులు చిరకాలం గుర్తు ఉంటాయని అన్నారు.