calender_icon.png 14 June, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేగొండను హుస్నాబాద్‌లో కలుపుతం

13-06-2025 02:10:08 AM

  1. ఆ ఊరును అక్కన్నపేటలో కలపడం తప్పే
  2. మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ / సిద్దిపేట, జూన్ 12 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మం డలంలో ఉన్న రేగొండ గ్రామాన్ని ఇకపై హు స్నాబాద్లో కలుపుతామని రవాణా, బీసీ సం క్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్ర కటన చేశారు. గతంలో ఈ ఊరును అక్కన్నపేటలో కలపడం తప్పేనన్నారు. అక్కన్నపేట లో నిర్మించిన కేజీబీవీ కొత్త బిల్డింగ్ ను ఆ యన గురువారం ఓపెన్ చేశారు. హుస్నాబాద్‌లోని కేజీబీవీలో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు.

అనంతరం నాలుగు సంవత్సరాలుగా రేగోడులో మూతపడి ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ప్రారంభించారు. సిద్దిపేట అర్బన్ మండలం లోని మిట్టపల్లి గ్రామంలో గల కేజీబీవీ సందర్శించి పాఠశాలను ప్రారంభించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రా రంభం కావడంతో మొదటిరోజు బడికి వ చ్చిన విద్యార్థులకు పూలు చల్లి ఆశీర్వదించిన మంత్రి, వారికి ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు.

అనంత రం ఆయన మాట్లాడుతూ ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో అనాలోచితంగా రేగొండను అక్కన్నపేట మండలంలో కలిపారన్నారు. గ్రామానికి దగ్గరగా ఉన్న హుస్నాబాద్ నుంచి విడగొట్టి దూరంగా ఉ న్న అక్కన్నపేటలో కలపడం తప్పన్నారు.

ప్రైవేట్ స్కూళ్ల బస్సులను ఊర్లల్లకు రానీయొద్దు

‘పిల్లల భవిష్యత్తును ఇక్కడ నుంచే ప్రారంభించాలి. ఉపాధ్యాయులు మంచి చదువు చె ప్పితే, మిగతా పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని మంత్రి సూచించారు. ప్రై వేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్న ధోరణిని ఆయన ప్రశ్నించారు. ‘అన్ని అర్హతలు ఉండి, అధ్యాపకులు ఉండి, పాఠశాల ల్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ పా ఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్రభు త్వ పాఠశాలలో చదువుతారా అనే నామోషీ ఉండదు. నేను, కలెక్టర్ అందరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని వచ్చాం,‘ అని గు ర్తు చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రి అని పేర్కొంటూ, ప్రభుత్వ పాఠ శాలల్లో ఏమైనా ఇబ్బందులుంటే గ్రామ పెద్దలు ప్రైవేట్ బస్సులు తమ గ్రామానికి రా కుండా చూసి, పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని సూచించారు.

అభివృద్ధి, పర్యవేక్షణకు హామీ

తరగతి గదుల, బాత్రూమ్ల నిర్మాణం వెం టనే చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి, వారం పది రోజుల్లో మళ్ళీ పాఠశాలకు వచ్చి విద్యాబోధన, భోజనం, బాత్రూ మ్లు, క్లాస్రూమ్ల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కాలేజీల్లో చదువుతున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ‘రేపు మీరే ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ఉన్నత ఉద్యోగులు అవుతారని విద్యార్థులను ప్రోత్సహించారు. 

ఇందిరమ్మ ఇండ్ల కోసం మహిళా సంఘాల నుంచి రూ.లక్ష ఇప్పిస్తం 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులకు మహిళా సంఘా ల ద్వారా రూ.లక్ష రుణం అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అ క్కన్నపేట మండలం గోవర్ధనగిరి లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు సింగపాక మల్లవ్వ ఇం టి నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు. ప్రతి ఇం దిరమ్మ ఇంటి నిర్మాణానికి 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందిస్తామన్నారు.

లబ్ధిదా రులందరూ ఇండ్ల పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. నియోజకవర్గానికి 35 00 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, రెండు నెలల్లో మరో 3500 ఇందిర మ్మ ఇండ్లు రానున్నాయని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, డీఈవో శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.