13-06-2025 08:51:45 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వ దర్శనానికి(Srivari Sarva Darshan) అన్ని కంపార్టు మెంట్లు నిండి భక్తులు క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. 69,609 మంది భక్తులు నిన్న తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. 33,144 మంది భక్తులు తిరుమలలో శ్రీవారికి తల నీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.11 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
తిరుమల సమాచారం
అప్పలాయగుంట(Appalayagunta) శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి(Sri Prasanna Venkateswara Swamy) వార్షిక బ్రహ్మోత్సవాలు(Srivari Brahmotsavam) ఈ నెల 15 వరకు నిర్వహించనున్నారు. అప్పలాయగుంట తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో ఇది ఒకటి. నేడు సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ కార్యక్రమాలు చేయనున్నారు. టీటీడీ పాఠశాలల్లో(TTD schools) ఈ నెల 16 నుంచి 19 వరకు సద్గమయ కార్యక్రమం నిర్వహించనున్నారు.