03-06-2025 05:32:12 PM
నిర్మల్ (విజయక్రాంతి): లక్ష్మణ చందా మండలం పారిపెల్లి గ్రామములో నిర్మల్ డిపో మేనేజర్ కే పండరి(Nirmal Depot Manager K. Pandari) ఆదేశానుసారం బస్ పాస్ మేలా మంగళవారం నిర్వహించారు. అర్హులయిన 20 మంది దివ్యాంగులకు ప్రయాణములో 50% రాయితీతో కూడిన బస్ పాసులను అందచేశారు. ఈ బస్ పాస్ డీలక్స్, ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సులలో ప్రయాణములో 50% రాయితీ తో ప్రయాణించవచ్చని ఇంకా గ్రామములో దివ్యాంగులు బస్ పాస్ లు లేని వారు సదరం సర్టిఫికెట్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒక ఫొటో 50/- రూ. తీసుకొని వచ్చి పాస్ పొందాలని విలేజ్ బస్ ఆపీసర్ టి. వి.రమణ తెలిపారు. కార్యక్రమములో గ్రామ వీడిసి సభ్యులు నర్సయ్య,లింగారెడ్డి,శంకర్,దివ్యాంగులు పాల్గొన్నారు.