calender_icon.png 5 June, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

03-06-2025 05:35:54 PM

పట్టణంలో యోగవాక్..

మందమర్రి (విజయక్రాంతి): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు తమదైనందిన జీవితంలో యోగాను ఆచరించి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయుష్ వైద్యురాలు నీరజ(Ayush Dr. Neeraja), యోగా శిక్షకులు కొంపెల్లి రమేష్ కుమార్(Yoga Instructor Kompelli Ramesh Kumar)లు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకొని మంగళవారం అవగాహన ర్యాలీ, యోగ వాక్ చేపట్టారు. ఈ ర్యాలీ పట్టణంలోని పాత బస్టాండ్ హెచ్పీ పెట్రోల్ బంక్ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుష్ వైద్యురాలు, యోగా శిక్షకులు మాట్లాడుతూ... శరీర ఆరోగ్యానికి యోగ తప్పనిసరని ప్రతి ఒక్కరు యోగాను విధిగా ఆచరించాలని కోరారు.

యోగాతో కలిగే ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సం. జూన్ 21న యోగా దినోత్సవం నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు యోగా సాధన ద్వార శారీరకంగా, మానసికంగా, దృఢంగా ఉంటామని ఎక్కువ సమయం వెచ్చించలేని వారు కనీసం ప్రాణాయామం ఆచరించి ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజి ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రామటెంకి దుర్గరాజ్, పాత బస్టాండ్ వ్యాపార సంఘం అధ్యక్షులు వడ్లకొండ కనకయ్య, సభ్యులు నాకోటి వెంకటేశ్వర్లు, మార్కండేయ, బింగి రాజన్న యోగ శిక్షకులు రామ్మోహన్, శిక్షకురాలు శైలజ లు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.