calender_icon.png 5 June, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీ ఆర్టీసీ సేవలపై ప్రజల్లో సంతోషం

03-06-2025 05:29:40 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీజీ ఆర్టీసీ అందిస్తున్న సేవలు ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చడంతో ప్రయాణికులు సంతోషంగా ఉన్నారని అదిలాబాద్ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్(Adilabad Regional Manager Bhavani Prasad) అన్నారు. మంగళవారం నిర్మల్ డిపోను సందర్శించి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ డిపో ద్వారా అందిస్తున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసి ప్రయాణికులకు ఎలాంటి అవసరం ఉన్న ఆర్టీసీ బస్సులను నడపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎం ను నిర్మల్ డిఎం పండరీ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది దేవి రావు వీజీ రెడ్డి రమణ ఏ ఆర్ రెడ్డి తదితరులు ఉన్నారు.