11-06-2025 10:46:10 PM
డిఎమ్ పండరి..
నిర్మల్ (విజయక్రాంతి): రేపటి నుండి విద్యార్థులకు బస్ పాసులు జారీ చేయనున్నట్లు డిపో మేనేజర్ కే. పండరి(Depot Manager K. Pandari) తెలిపారు. 12 సంవత్సరం లోపు బాలురకు 20 కి.మీ.ల వరకు ఉచిత పాసులు ఇవ్వబడును. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల వారు ఉచితంగా నిర్మల్ బస్టాండ్ బస్ పాస్ కౌంటర్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల వారు ఆర్టీసీకి అడ్మినిస్ట్రేషన్ ఛార్జి డి.డి. బ్యాంక్ లో తీయవలసి ఉంటుందని, డి. డి. మా కౌంటర్ లో ఇచ్చి మీ కళాశాల రిజిస్ట్రేషన్ చేసుకుని పాసులు పొందవచ్చని ఆయన తెలిపారు.
విద్యార్థులు www.tgsrtcpass.com ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పోరించి, ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్ సంతకము స్టాంప్ వేసుకొని వచ్చి ఆర్టీసీ కౌంటర్ వద్ద బస్ పాస్ పొందాలని సూచించారు. ప్రైవేట్ విద్యాసంస్థల వారు ఈ క్రింది విధంగా అడ్మినిస్ట్రేట్ ఛార్జీలు చెల్లించవలసి ఉంటుందన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు అకౌంట్ ఆఫీసర్, టిజిఎస్ఆర్టిసీ, ఆదిలాబాద్ పేరుపైన డి డి. తీయవలసి ఉంటుందని తెలిపారు. ఈ సదుపాయాన్ని విద్యార్థులు సద్వినియోగ పరచుకోవాలని డిపో మేనేజర్ తెలిపారు.