calender_icon.png 17 June, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి

11-06-2025 10:39:58 PM

హుజురాబాద్ తహశీల్దార్ కనకయ్య..

హుజురాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం వినూత్న ఆలోచనలతో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి మార్గదర్శకత్వంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో బుధవారం 'విద్యా వాహిని' ప్రచార రథం హుజురాబాద్ ఎమ్మార్వో కనకయ్య(MRO Kanakaiah) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి అన్నారు.

విద్యా వాహిని ప్రచార రతాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ఈ కార్యక్రమం చేపట్టారు అని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల పిల్లలను చదివించాలని నాణ్యమైన విద్యను పాఠశాలలో అందిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో నేర్చుకున్న విద్యా ప్రగతికి బాటలు వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  శ్రీనివాస్, మాజీ సర్పంచ్ విజయ్ కుమార్, కొండల్ రెడ్డి, లక్ష్మణ్, వెంకటేశ్వరావు, వెంకట్ రెడ్డి, సదాశివరెడ్డి, దోమ సదానందం  తో పాటు తదితరులు పాల్గొన్నారు.