11-06-2025 10:50:10 PM
ఐఎస్ఎఫ్ మండల సమితి అధ్యక్షులు వేణుగోపాల్..
హుజురాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు పాసులు అందించాలని ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు వేణుగోపాల్(AISF Mandal President Venugopal) డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో బుధవారం డిపో మేనేజర్ రవీంద్రనాథ్(Depot Manager Ravindranath)కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ... బస్సు పాస్ పెంపు నిర్ణయం పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమే అని అన్నారు. విద్యార్థుల బస్ పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పది లక్షలకు పైగా పేద, మధ్యతరగతి గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుకోవడానికి ఆర్టీసీ బస్సుల ద్వారా పట్టణాలకు వెళుతుంటారని ఈ చార్జీలు పెంపు ద్వారా వారిపై పెనుబారం పడుతుందని ఆర్టిసి యజమాన్యం నెలకు400 రూపాయలు ఉన్న బస్సు పాస్ చార్జి 600కు పెంచుతూ మూడు నెలల ప్యాకేజీని 19 నుంచి 1800 పెంచుతూ 20% పైగా చార్జీలు పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్, రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు.