హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ క్యాబ్డ్రైవర్ ఉరే సుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం పేట్బషీరాబా ద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు మెదక్ జిల్లా శంకరంపేట గ్రామానికి చెందిన అరికెల మహేశ్ (28) క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ, కొంపల్లిలోని నార్త్ ఎన్సీఎల్లో నివాసం ఉంటున్నాడు. కాగా, మహే శ్ ఇటీవల ఒక ట్రాలీ ఆటోను కొనుగోలు చేయడంతో ఆర్థిక ఇబ్బందు లు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మహేశ్ ఇంట్లో ఎవరులేని సమయంలో ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.