బీజేపీలోనే ఓబీసీలకు సముచిత స్థానం

29-04-2024 01:10:06 AM

దేశవ్యాప్తంగా ఓబీసీలకు న్యాయం చేస్తున్నది బీజేపీ మాత్రమే 

తెలంగాణ ఎంబీసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ 

వరంగల్ తూర్పు, ఏప్రిల్28 (విజయక్రాంతి): సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినా దంతో దేశ వ్యాప్తంగా ఓబీసీల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ ఒక్క బీజేపీ మాత్రమేనని తెలంగాణ ఎంబీసీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వరంగల్ దేశాయిపేట రోడ్‌లోని ఓ కళ్యాణమండపంలో జిల్లా ఓబీసీ మోర్చా వరంగల్ పార్లమెంట్ స్థాయి సామాజిక సమ్మేళనం జరిగింది. జిల్లా  ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కందిమల్ల మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తాడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీ అందించ ని సహాయ, సహకారాలను బీజేపీ ప్రభు త్వం ఓబీసీలకు కల్పించిందన్నారు. 

ఓబీసీల కోసమే విశ్వకర్మ యోజన

రూ.13వేల కోట్లతో 30 లక్షల కుటుంబాలకు లబ్ధిచేకూర్చడం కోసం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని కేవ లం ఓబీసీల కోసమే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నీట్‌లో ఓబీసీ విద్యార్ధులకు 27శాతం సీట్లు కేటాయించారని, కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గంలో, ఐదు ప్రధాన క్యాబినెట్ మంత్రి పదవులతో పాటుగా 27 మందికి మంత్రులు, సహా య మంత్రులుగా అవకాశాన్ని కల్పించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో వరం గల్  బీజేపీ పార్టమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్, పార్లమెంట్ నియోజకవర్గ ప్రభారి మురళీధర్ గౌడ్, జాతీయ కౌన్సిల్ సభ్యు లు శ్రీరాములు, వరంగల్ జిల్లా అధ్యక్షు డు గంటా రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పదీప్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి భాకం హరిశంకర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.