ఆలయ నిర్మాణాలకు భూమిపూజ

29-04-2024 01:06:29 AM

పటాన్‌చెరు, ఏప్రిల్ 28 : గడ్డపోతారం పంచాయతీ అల్లీనగర్ గ్రామంలో గాలిపోచమ్మ, ఎల్లమ్మ, కట్ట మైసమ్మ ఆలయాల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. గ్రామంలో ఒకేసారి మూడు ఆలయాలను నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించడంతో పండుగ వాతావరణం ఏర్పడింది. ఆలయాల నిర్మాణానికి తమవంతు సహకారం అందిస్తామని నాయకులు తెలిపారు. ఎంపీటీసీ జానబాయి, మాజీ సర్పంచులు ప్రకాశ్‌చారి, శ్రీనివాస్, అశోక్, మాజీ ఎంపీటీసీ బాశెట్టిరాజు, నాయకులు మద్దూరి పెంటేశ్, లక్ష్మణ్‌రావు, గ్రామస్తులతో పాటు గడ్డపోతారం, చెట్లపోతారం, కిష్టయ్యపల్లి పాల్గొన్నారు.