02-06-2025 02:46:29 AM
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ఈనెల 5న క్యాబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఆదివారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ర్ట అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధత, రాజీవ్ యువవికాసం అంశాలపై మంత్రులు అం దించిన నివేదికపై సమావేశంలో చర్చించారు.
మే 29, 30తేదీల్లో జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితాలు, రెవె న్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీగా తయారుచేసిన నివేదికలపై సమావేశంలో వివరించారు.
రాజీవ్ యువ వికాసా నికి ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, అనర్హులకు యువవికాసం అందకుండా చూడాలని పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెద్దసంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు.
మరింత లోతుగా విశ్లేషించి లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దన్నారు. ఈఅంశంపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందించా రు.
ఆ నివేదికపై భట్టివిక్రమార్క సీఎం రేవంత్రెడ్డికి, మంత్రులకు వివరించారు. దీనిపై క్యాబినెట్లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థ వంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని మంత్రులు అభినందించారు.