02-06-2025 02:44:35 AM
ఐఐఎంసీ కాలేజీలో నిర్వహణ
ఖైరతాబాద్, జూన్ 1: యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, ఐఐఎంసీ కళాశాల, మానస ఆర్ట్స్ థియేటర్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహిస్తున్న ‘తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమం’ ఎనిమిదవ సమావేశాన్ని ఆదివారం ఐఐఎంసీ కళాశాల సభా ప్రాంగణంలో నిర్వహించారు. సభాధ్యక్షుడు ఆచార్య ఫణీంద్ర మాట్లాడుతూ..
తెలుగు భాషా సాహిత్యాన్ని వ్యా ప్తి చేయాలనే ఉద్దేశంతో తెలుగు వెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మొ త్తం 32 సంస్థలు తమతో కలిసి తెలుగు వెలుగు కార్యక్రమాలను నిర్వహించడానికి ముందుకు వచ్చాయని తెలియజే శారు. దూరదర్శన్ పూర్వ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు మాట్లాడుతూ.. “నేను ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పటి నుంచి ఆకాశవాణిలో, దూరదర్శన్లో తెలుగు సాహిత్యానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రసారం చేశానని” తెలియజేశారు.
మానస ఆర్ట్స్ థియేటర్స్ సంస్థ కార్యదర్శి రఘుశ్రీ మాట్లాడుతూ.. యువభారతి వారి ఆధ్వర్యంలో తెలుగు వెలుగు కార్యక్రమం చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ నోరి రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ఐఐఎంసి కళాశాల పూర్వ ప్రిన్సి పల్ పూర్ణచందర్రావు స్ఫూర్తితో నేను ఇంతటి స్థాయిలో నిలబడ్డానని చెప్పారు.
కాకర్ల హనుమంతరావు ఆదిభట్ట నారాయణదాసు విరచిత ‘సీతా కళ్యాణం‘ హరికథను దక్షిణామూర్తి, సుధాకర్ వాద్య సహకారంతో రమణీయంగా గానం చేశారు. ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలలో డిగ్రీ స్థాయిలో తెలుగు భాషకు క్రెడిట్లు తగ్గించడం వలన తెలుగు భాషకు, తెలుగు భాషోపాధ్యాయులకు తీరని నష్టాన్ని చేకూరుస్తుందని, ఈ విషయంపై యువభారతి సంస్థ ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచించారు.
యువభారతి వ్యవస్థాపక సమావేశ కర్త ఆచార్య వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ.. తెలుగు వెలుగు సమాఖ్య కార్యక్రమాల నిర్వహణకు ఆర్థిక, హార్థిక సహకారం అందజేస్తున్న సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జీ వెంకట్రావు, రవీంద్ర, నారాయణరెడ్డి, రామకృష్ణ, శ్యామ్ యువభారతి సభ్యులు, సాహిత్య అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.