calender_icon.png 10 December, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు కోసం వీల్ చైర్ లో ప్రచారం

10-12-2025 05:10:33 PM

మోతే (విజయక్రాంతి): మోతే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పల్లెల వనిత ఓటు కోసం వీల్ చైర్ లో ప్రచారం నిర్వహించడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వనితకు భారత వికలాంగుల హక్కుల పరి రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ నెల 14న గ్రామంలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పల్లెల వనిత డిగ్రీ వరకు చదువు కొని ప్రజా సేవ చేయడానికి ముందుకు వచ్చిన పల్లెల వనిత టుత్ పేస్ట్ గుర్తు కు మీ అమూల్యమైన ఓటు వేయాలని గ్రామ ఓటర్లను అభ్య ర్ధించారు. పంచాయతీ ఎన్నికలు డబ్బు మద్యం మాంసం చుట్టు తిరుగుతున్నాయని మండిపడ్డారు.

ప్రజలు చాల చైతన్య వంతం కలిగిన వారని గ్రామంలో పని చేసే వారు ఎవరు పెత్తన్నం చేసే వారు ఎవరు అనే విషయం ప్రతి ఓటరు గుర్తు ఉన్నదని చెప్పారు. అమాయక మైన వారిని అభ్యర్థులను ఎంపిక చేసుకొని విచ్చల విడిగా డబ్బులు పంచి గ్రామ అభివృద్ధికి అడ్డు పడుతున్న వారికి సరైన సమాధానం గ్రామ ప్రజలు చెపుతారని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించిన పల్లెల వనిత ను గెలిపిస్తే అభివృద్ధికి బాటలు వేస్తామని తెలిపారు. విద్యార్థులు మేధావులు రైతులు మహిళలు ఆలోసించి ఓటును వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి పల్లెల వనిత, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జంజిరాల సుధాకర్, బొల్లం లింగయ్య యాదవ్, తురక నాగమ్మ, జిల్లేపల్లి శివ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.