calender_icon.png 27 June, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నారై అయితే భార్యను వేధించొచ్చా!

27-06-2025 01:39:48 AM

అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళొద్దా..? 

ఇల్లెందు, జూన్ 26 (విజయక్రాంతి): బలం.. బలగం ఉంటే ఆడపిల్లలను వేధించొచ్చా.. అన్యాయం జరిగిందని పోలీస్ స్టే షన్ను ఆశ్రయిస్తే పట్టించుకునే వారే లేకపోవడం బాధను కలిగిస్తుంది. తన ఎన్నారై భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని, నిందలు వే స్తున్నాడని, న్యాయం చేయాలని కోరితే స్పం దన లేదు. కానీ తన భర్త తన తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి అమర్యా దగా మాట్లాడాడని సీఐ పై ఫిర్యాదు చేస్తే హుటాహుటిన సీఐని సస్పెండ్ చేసిన అధికారులు తమ విషయంలో ఫిర్యాదు చేసి వా రం గడుస్తున్నా ఎందుకు న్యాయం చేయట్లేదు అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. 

ఆడపిల్లలను కనడమే తల్లిదండ్రులు చేసిన తప్పా.. 

పెంచి పెద్దచేసి ఉన్నత చదువులు చదివించారు. కానీ ఎన్నారై సంబంధం అయితే తన బిడ్డ ఆనందంగా ఉంటుందని తన భర్త విషయంలో నమ్మి మోసపోయారఅంటూ ఎన్ ఆర్‌ఐ భార్య దుబ్బాక శ్రావ్య ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఇల్లెందు పట్టణంలో ఎ న్నారై భార్య దుబ్బాక శ్రావ్య కుటుంబ సభ్యు లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023 అక్టోబర్ 8వ తేదీన ఇల్లెందు  మం డలం లలితాపురంకు చెందిన పెండ్లి నవీన్ కుమార్‌రెడ్డితో వివాహం జరిగిందని, వివా హం జరిగిన రెండు నెలలకు అమెరికాకు కా పురానికి తీసుకువెళ్లాడని తిరిగి రెండు నెలల తర్వాత హోమ్ సిక్ కోసం ఇండియాకు పంపించినట్లు పేర్కొన్నారు. మరల తిరిగి అ మెరికాకు వెళ్లాలని 2024 అక్టోబర్ లో వీసా స్టాంపింగ్ ఉందని ముందుగా తనను ఇండియాకు పంపించాడని, అదే సమయం లో చేయించిన రిటర్న్ టికెట్స్ ను 15 రోజుల తర్వాత టికెట్స్ తో పాటు వీసాను క్యాన్సిల్ చేయించాడని తెలిపారు. 

అంతేకాకుండా త నకు చెప్పకుండా వైద్యశాలకు తీసుకెళ్లి టెస్టులు చేయించారని, టెస్టుల్లో సైతం ఎటువంటి లోటుపాట్లు లేవ ని స్వయంగా తమ అత్తమామల ముందు వైద్యురాలు స్పష్టం చేసిందని తెలిపారు. వైద్యురాలు తన భర్తను సైతం టెస్టులు చేయించుకోవాలని సూచించినప్పటికీ తన భర్త తనలో ఎటువంటి లో పాలు లేవని తాను ఫిట్గా ఉన్నట్లు దబాయి స్తూ మాట్లాడారన్నారు.

8 నెలలుగా తోటి కోడలు, అత్తమామలు బెదిరింపులకు పాల్పడుతున్నారని నీ భర్త నాలుగు సంవత్సరాల వరకు రాడని ఏం చేసుకుంటావో చేసుకో మాకు అండగా అధికారుల బలం బలగం ఉందని బెదిరిస్తున్నారని విలపిస్తూ పేర్కొం ది. ఇదే విషయమై జిల్లా ఎస్పీని కలిసి ఫి ర్యాదు చేశామని ఆయన సూచన మేరకు కే సు ఇల్లందుకు బదిలాయించాలని తెలిపా రు. ఈ క్రమంలోని ఈ నెల 19వ తేదీన ఇల్లందు పోలీస్ స్టేషన్ రాగా పోలీసులు తన అత్తమామలను పిలిపించి మాట్లాడారని, షీ టీంలతో కౌన్సిలింగ్ ఇప్పిచ్చారని పేర్కొన్నా రు.

అనంతరం ఈనెల 25వ తేదీ బుధవా రం తమకుమారుడుతో రావాలని వచ్చి స మస్యను పరిష్కరించుకోవాలని సూచించిన ట్లు పేర్కొన్నారు. తాము 25వ తేదీన స్టేషన్కు వచ్చిన నేపథ్యంలో తమను ఎవరూ పట్టించుకోలేదని అదే సమయంలో తన భర్త ఫిర్యాదు మేరకు సీఐను సస్పెండ్ చేసినట్లు స్టేషన్లో మాట్లాడుకుంటుంటే తెలిసింద న్నారు. తామ ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా తమకు న్యాయం చేయని అధికారులు ఎన్నారై భర్త ఫిర్యాదు చేస్తే సీఐని సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయమని, తమకు న్యాయం చేయాలని ఐజీని, డీజీపీని, సీఎం రేవంత్ రెడ్డిని సైతం కలుస్తామన్నారు.

నా చెల్లి పెళ్లి సైతం చెడగొట్టేందుకు కుట్రలు చేశారనీ ఇప్పించారు

నా చెల్లికి పెళ్లి కుదిరిన విషయం తెలుసుకున్న తన భర్త రిలేషన్స్ కు, పెళ్లి కుమారుడు తరపు వారికి ఫోన్లు చేసి నా భార్యకు జబ్బులు ఉన్నాయని నన్ను మోసం చేసి పెళ్లి చేశారని లేనిపోని నిందలు వేశారని తెలిపింది. తాము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామని ఎలాంటి టెస్టులు చేయించినా చేయించుకునేందుకు వెనుకాడమని, టెస్టుల్లో తనలో ఏవైనా లోపాలు ఉంటే తామే తప్పుకుంటామని శ్రావ్య తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ముందు భర్తను పిలిపియాలని లేనిపక్షంలో న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని పేర్కొన్నారు.