27-06-2025 01:39:34 AM
చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్
ముషీరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండి బాగా చదువుకోవాలని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ సూచించారు. యాంటీ డ్రగ్స్ డే ను పురస్కరించుకొని గురువారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో ముషీరాబాద్ డివిజన్లోని రాంనగర్ సెయింట్ ప్రాన్సిస్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ కుమార్ మాట్లాడుతూ... విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా సన్మార్గంలో నడవాలని సూచించారు. తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చే విధంగా క్రమశిక్షణతో ముందుకు సాగినప్పు డే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నా రు.
డ్రగ్స్ వల్ల ఉజ్వల భవిష్యత్ నాశనం అవుతుందని, చెడు అలవాట్లు గల వ్యక్తులతో స్నేహం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రాంబాబు, ఎస్త్స్ర రాజేష్, డీ ఎస్ఐ చలపతి రెడ్డి, సెయిం టాన్సిస్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.