04-06-2025 01:12:58 AM
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): మిస్ వరల్డ్ పోటీల ఖర్చులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.30 కోట్లు ఖర్చయిందని, స్పాన్సర్ల ద్వారానే రూ.21 కోట్లు రాగా, రాష్ర్ట ప్రభుత్వానికి కేవలం రూ.9 కోట్లే ఖర్చయిందని స్పష్టం చేశారు. మరో రూ.11 కోట్ల ఆదాయంపై ఒప్పందాలు ఉన్నాయని వివరించారు.
హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి జూపల్లి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ పోటీలపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు ఎక్కడైందో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ‘తెలంగాణ భవన్కు రావాలా? అబిడ్స్ చౌర స్తాకు రావాలా? రూ.200 కోట్లు ఖర్చయినట్టు నిరూపించకుంటే ముక్కు నేలకు రా యాలి’ అని మంత్రి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో టూరిజం ప్రమోషన్లకే రూ.115 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిపారు. ఇంత పెద్ద ఈవెంట్ను తక్కువ ఖర్చుతో ఘనంగా నిర్వహించామని స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా తెలంగాణ పర్యాటక ప్రాం తాల ప్రమోషన్, సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీలు విజయవంతమయ్యాయని చెప్పారు.
పోటీల నిర్వహణపై రాష్ర్ట ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అభినందించాల్సి పోయి, విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. సొంత పత్రికలు, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేశారని, అందగత్తెల కాళ్లు కడిగారని విషప్రచారం చేశారని జూపల్లి మండిపడ్డారు. పోటీదారులకు 30 తులాల బంగారం ఇచ్చారనేది ప చ్చి అబద్ధమని కొట్టిపారేశారు.
చౌమాహల్లా ప్యాలెస్ విందులో ఒక్కో ప్లేట్ భోజనానికి రూ.లక్ష ఖర్చు చేశారనేది అవాస్తమని, రూ.8,200 మాత్రమే ఖర్చు చేశామని స్ప ష్టం చేశారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలను జూపల్లి ఖండించారు. దీనిపై కొందరు బీఆర్ఎస్ నాయకులు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని పేర్కొన్నారు. మిస్ ఇంగ్లాండ్ను ఇబ్బంది పెట్టారనేది వా స్తవమయితే మిగతా 108 మంది పోటీదారులు చివరి వరకు ఉండేవారు కాదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ ఖ్యాతి ఖం డంతరాలను దాటిందన్నారు.
ఈ పోటీలతో ప్రభుత్వానికి వస్తున్న మంచిపేరును చూసి ఓర్వలేకే అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని మండిపడ్డారు. రామప్ప, పోచంపల్లి, వేయిస్తంభాల గుడి, కాకతీయుల కోట, ఓల్డ్ సిటీ తెలంగాణ చారిత్రాత్మక అంశాలు సందర్శించడం ద్వారా రాష్ట్ర గౌరవం మరింత పెరి గిందని మంత్రి పొన్నం చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని, మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణను ప్రపంచమే గుర్తించే విధంగా జరిగా యన్నారు. సమావేశంలో నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, పర్యాటక శాఖ డైరెక్టర్ హన్మంతు జండగే తదితరులు పాల్గొన్నారు.