calender_icon.png 30 May, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తు చికిత్సతో క్యాన్సర్ నివారణ

29-05-2025 01:54:09 AM

జగిత్యాల అర్బన్, మే 28: ముందస్తు పరీక్షలు, చికిత్సతో క్యాన్సర్ వ్యాధి నివారణ సాధ్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల ఓల్డ్ హైస్కూల్లో బుధవారం ఐఎంఏ జగిత్యాల శాఖ, కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం ప్రారంభించి, పరీక్షల సరళిని ఎమ్మెల్యే పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు వారి జీవన విధానం, వ్యాయామం, వాకింగ్ ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు. క్యాన్సర్ నివారణ చర్యలపై ఐఎంఏ రూపొందించిన కరపత్రం, ప్రచారం వల్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం మంచి కార్యక్రమని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మూఢనమ్మకాలను నమ్మవద్దని, సైన్స్ ను నమ్మి ముందస్తు చికిత్స చేసుకోవడం ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యమౌతుందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు. రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ముందస్తు పరీక్షలు ఉత్తమం అన్నారు.

ఈ కార్యక్రమంలో  మున్సిపల్ మాజీ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ హేమంత్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ వైద్యులు మోహన్ రెడ్డి, వజ్రాల గంగాధర్, మధు, శ్రవణ్, సుధీర్, సురేష్, మాజీ కౌన్సిలర్ చుక్క నవీన్, మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, భాను పాల్గొన్నారు.