calender_icon.png 30 May, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన పేదలకే సంక్షేమ ఫలాలు

29-05-2025 01:52:30 AM

జగిత్యాల, మే 28 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అరులైన పేద ప్రజలకే ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందజేస్తున్నదని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

జగిత్యాల జిల్లా వేములవాడ నియోజక వర్గ పరిధిలోని మేడిపల్లి, భీమారం మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం మేడిపల్లి మండల కేంద్రంలోని పిఎన్‌ఆర్ గార్డెన్లో బుధవారం జరిగింది.  వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సదరు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరి పత్రాలు పంపిణీ చేశారు.

మేడిపల్లి మండలంలో   మొత్తం 2 వందల 46 ఇండ్లు మంజూరవగా, ఎంపిక చేసిన 1 వంద 54 మంది లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. అలాగే భీమారం మండలంలో మొత్తం 1 వంద 51 ఇండ్లు మంజూరవగా,  1 వంద 28 మంది లబ్ధిదారులకు మంజూరి పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 6 గ్యారంటీల అమల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుందన్నారు. గత పాలకుల హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు.

రాష్ర్టంలోని ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందన్నారు. వేములవాడ నియోజకవర్గ లో ప్రతి మండలంలోని గ్రామ గ్రామాన అరులందరికీ సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత తనదేనని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణంలో అధికార యంత్రాంగం నాణ్యత ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించిందన్నారు.

అరులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించేందుకు జిల్లాలో ప్రభుత్వపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల, మెట్పల్లి రెవెన్యూ డివిజన్ అధికారులు జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, ఆయా మండలాల ఎమ్మార్వోలు. ఎంపీడీవోలు,  సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ బాధ్యులు, నాయకులు పాల్గొన్నారు.