31-05-2025 03:03:34 AM
కేర్ హాస్పిటల్ డాక్టర్ జయచంద్ర
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): పొగాకు వలన కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, ఊపిరితిత్తుల సమస్యలు, నోటి క్యాన్సర్కు కారణమవుతుందని బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్స్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఏ జయచంద్ర అన్నారు. శనివారం ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. భారతదేశంలో 26 కోట్ల మంది పొగాకు వాడుతున్నారని, సంవత్సరానికి సుమారు 13 లక్షల మంది దీని వలన మరణిస్తున్నారని గణాంకాలు చెపుతున్నాయన్నారు.
పొగ తాగే వారిలో ఊపిరితిత్తులు బలహీనపడతాయి, వారికి తరచూ శ్వాస సమస్యలు, ఇన్ఫెక్షన్లు వస్తుంటాటయన్నారు. పొగాకు వినియోగం వ్యక్తిగత ఇష్టం కాదు. ఇది కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. యువతను లక్ష్యంగా చేసుకొని రంగు, వాసనలతో ఆకర్షించే ఉత్పత్తులు తయారు చేస్తోంది పరిశ్రమ. దీన్ని మనం అడ్డుకోవాలి, అని ఆయన అన్నారు. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని, డాక్టర్లు ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు కలిసి పని చేసి యువతను పొగాకు నుంచి రక్షించాలన్నారు.