31-05-2025 03:06:38 AM
మంచిర్యాల, మే 30 (విజయక్రాంతి): బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్ కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతామని చెప్పారని, దానికి తాను ఒప్పుకోలేదని వెల్లడించా రు. తన తండ్రి కేసీఆర్కు లేఖ రాయడంలో తన తప్పేం లేదని చెప్పారు.
కేసీఆర్ణు కలిసి ఇదంతా చెప్పాలని ప్రయత్నం చేశానన్నారు. తండ్రి ని కలిసే అవకాశం వచ్చింది గానీ తాను కలవలేక పోయానని పేర్కొన్నారు. ఇ ప్పటికైనా లేఖ బయటికి తీసుకు ని వచ్చిన వారిని పట్టుకోవాలని ఆమె కోరారు. కాగా కాంగ్రెస్ పార్టీలో కులరాజకీయాలు నడుస్తున్నాయని కవిత ఆరోపించారు. నిమ్నవర్గ నాయకులను సీఎం రేవంత్రెడ్డి తక్కువగా చూస్తున్నారని, ఇటీవల జరిగిన సరస్వతీ పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను అవమానించారని చెప్పారు. ఆయనను పుష్కరాలకు ఆహ్వానించకపోవడం బాధాకారమని పేర్కొన్నారు.
యాదగిరిగుట్టలోనూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కింద కూర్చోపెట్టి సీఎం రేవంత్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీనియర్ జర్నలిస్ట్, సింగరేణి మాజీ కార్మికుడు ఎండీ మునీర్ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచి కార్మికులను, నాయకులను, అధికారులను ఏకం చేయడంలో ప్రధాన పాత్ర వహించారని అన్నారు. మునీర్ సేవలను రాష్ట్ర ప్రజలు మరువలేరని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు.
ఆపరేషన్ కగార్ ఆపాలి
ఆపరేషన్ కగార్ ఆపాలని పదే పదే కోరినా బీజేపీ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కనీసం మృతదేహాలను కూడా మావోయిస్టుల కుటుంబాలకు అప్పగించలేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నంబాల కేశవరావు మృతి చెందితే కనీసం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం దారుణమన్నారు.