18-06-2025 12:22:30 AM
మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో నిర్వహణ
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): క్యాన్సర్ను జయించిన వారి స్ఫూర్తిని, ధైర్యా న్ని సత్కరిస్తూ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ జూన్ నెలను ‘క్యాన్సర్ సర్వైవర్స్ మంత్’గా పరిగణిస్తూ మంగళవారం ఘనం గా వేడుకలు నిర్వహించింది. ‘సెలబ్రేటింగ్ ది సూపర్ హీరోస్’ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాన్సర్ విజేతలు, వారి సంరక్షకులు, వైద్య నిపుణులు, ఆసుపత్రి సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మితాలీ అగర్వాల్ (తెలంగాణ నేషనల్ ప్రైడ్, బ్యూటీ ఐకాన్ మిసెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ విజేత 2025), సుమంతి చూరుకంటి (క్యాన్సర్ ఫైటర్, గృహిణి) హాజరయ్యారు. వారి వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మెడికవర్ వైద్య నిపుణులు క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విధానాలపై విలువైన సమాచారాన్ని అందించారు.
డాక్టర్ ప్రవీణ్ క్యాన్సర్ చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను వివరిస్తూ, రోగులకు సంపూర్ణ, సమగ్ర చికిత్సా విధానం ఎంత ముఖ్యమో చెప్పారు. డాక్టర్ ప్రశాంత్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, చిన్నపిల్లల కోసం సరికొత్త రేడియేషన్ పద్ధతుల పురోగతులను వివరించారు. డాక్టర్ రవి చందర్, సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్, మినిమల్ ఇన్వేసివ్, రోబోటిక్ సర్జరీల ప్రయోజనాలను వివరించారు.