22 June, 2026 | 3:18 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

బీఆర్‌ఎస్ హయాంలోనే చెరువుల కబ్జా

09-10-2024 02:24 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు  

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఇందిరాగాంధీ హయాంలో పేదలకిచ్చిన భూములు బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక దొరల చేతుల్లోకి పోయాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలోనే  ఎక్కువగా చెరువులు కబ్జాకు గురయ్యాయని ఆయన ఆరోపించారు.

మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను ‘ నీరుL మీరు ’ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్ నాయకుడు సుధాకర్‌రెడ్డి కబ్జా చేశాడని వీహెచ్ పేర్కొన్నారు. చెరువును ఆక్రమించినట్లుగా తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో మహ్మద్ అజం అనే వ్యక్తి బతుకమ్మ కుంట చెరువును ప్రభుత్వానికి అప్పజెప్పాడని   గుర్తు చేశారు.

కేసీఆర్ కూతురు బతుకమ్మను నిర్వహించిందని, కానీ బతుకమ్మ కుంటను కాపాడలేదని ఆవేదన వ్యక్తం చేవారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నగరంలోని చెరువులతో పాటు బతుకమ్మ కుంటను కాపాడాలని, చెరువును ఆక్రమించిన సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నాయకులు కళ్లు తెరవాలని, లేదంటే మహిళలే చీపురుతో కొడుతారని ఆయన హెచ్చరించారు.