09-11-2025 10:37:36 AM
అప్రమత్తమైన కుటుంబ సభ్యులు తప్పిన ప్రాణాపాయం
అచ్చంపేట: శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారులో అకస్మాత్తుగా మంటలు చెల్లారేగి కారు దగ్ధమైంది. వాన యజమాని అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే హైదరాబాదుకు చెందిన పవన్ కుమార్ తన 6 మంది కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నారు. కారు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గం ఈగలపెంట సమీపంలోకి హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై చేరగానే టయోటా కారులోనీ ఇంజనులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు యజమాని పవన్ కుమార్ కారున అక్కడే ఆపేసి కుటుంబ సభ్యులను కిందికి దించాడు. దీంతో వారంతా తృటిలో ప్రారంభం నుంచి తప్పించుకున్నారు. అప్పటికే మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలికి అగ్నిమాపక వాహనం చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేసింది. పోలీసులు చేరుకొని వివరాలను పరిశీలిస్తున్నారు.