3 April, 2026 | 3:27 PM

Breaking News

మార్పు రావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి.. జీవన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు   •   గంజాయి సేవించడం నేరం   •   దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు   •   TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి   •   ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •  

హరీశ్ రావుపై కేసు నమోదు

03-12-2024 12:19 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావుపై మంగళవారం కేసు నమోదైంది. తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీశ్ రావుపై 120(బీ), 386, 409, 506, రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ కింద పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతో పాటు అప్పటి టాస్క్  ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావును కూడా చేర్చడం గమనార్హం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. బీఆర్ఎస్ ప్రబుత్వంలో టాస్క్ ఫోర్స్ లో పని చేసిన పలువురు పోలీసులు అధికారులును అరెస్టు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్యను ఈ కేసులో పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.