10-11-2025 12:00:00 AM
జహీరాబాద్, నవంబర్ 9 : జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామ శివారులో పేకా ట ఆడుతున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ రూరల్ ఎస్త్స్ర కాశీనాథ్ తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు రంజోల్ గ్రామ శివారులోని డైమండ్ హో టల్ వెనకాల మామిడి తోట వద్ద పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకొని వారి వద్ద నుండి రూ.6,890 నగదు, 52 పేకాట ముక్కలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.