calender_icon.png 7 June, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళను వేధించిన కేసులో 9 మందిపై కేసు నమోదు

06-06-2025 08:16:21 PM

ఆరుగురు రిమాండ్, పరరిలో ముగ్గురు

నిందితుల్లో ఓ ప్రధాన పత్రిక విలేకరి

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపాలిటీ(Sultanabad Municipality)లోని అశోక్ నగర్ లో  గత కొన్ని రోజుల క్రితం ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తులపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళను వేధించిన(Harassing Woman Case) కేసులో పట్టణ ప్రాంతానికి చెందిన ప్రధాన పత్రిక విలేకరి బోగిరి అశోక్ తో సహా 9 మందిపై కేసు నమోదు చేసి, 6 గురిని రిమాండ్ చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నట్లు సుల్తానాబాద్ సీఐ  సుబ్బారెడ్డి(Sultanabad CI Subba Reddy) తెలిపారు.