06-06-2025 08:16:21 PM
ఆరుగురు రిమాండ్, పరరిలో ముగ్గురు
నిందితుల్లో ఓ ప్రధాన పత్రిక విలేకరి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపాలిటీ(Sultanabad Municipality)లోని అశోక్ నగర్ లో గత కొన్ని రోజుల క్రితం ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తులపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళను వేధించిన(Harassing Woman Case) కేసులో పట్టణ ప్రాంతానికి చెందిన ప్రధాన పత్రిక విలేకరి బోగిరి అశోక్ తో సహా 9 మందిపై కేసు నమోదు చేసి, 6 గురిని రిమాండ్ చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నట్లు సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి(Sultanabad CI Subba Reddy) తెలిపారు.