ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్
03-07-2026 08:41 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ ను శుక్రవారం ఆదిలాబాద్ రీజియన్ మేనేజర్ విజయ భాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బస్టాండ్ లోని టాయిలెట్లు, మంచినీటి సరఫరా, దుకాణాల నిర్వహణ, పరిశుభ్రత పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... బస్టాండ్ నిర్వహణ సంతృప్తికరంగా ఉందని అన్ని సౌకర్యాలు బస్టాండ్ లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.






