11-10-2025 10:22:04 PM
విజయక్రాంతి వార్తా కథనానికి స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న జిమ్ సెంటర్లో ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడి దాడి చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అండర్సన్ అనే యువకుడు గగ్గలపల్లి ప్రాంతంలోని సోలార్ పవర్ ప్రాజెక్టులో పని చేస్తూ శారీరక ఆరోగ్యం కోసం పోలీస్ స్టేషన్ ముందు ఉన్న విగోల్డ్ అనే జిమ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు.
శుక్రవారం జిమ్ చేస్తున్న క్రమంలో యువకుడి చేతి పక్కనే ఉన్న మరో యువకుడి చేతికి అనుకోకుండా తగలడంతో మాటమాట పెరిగి గొడవకు దారితీయగా గంజాయి బ్యాచ్ గా పేరు మోసిన కొంతమంది గ్యాంగ్ వచ్చి ఆ యువకుడ్ని చితకబాదిన విషయం తెలిసిందే. విజయక్రాంతిలో వార్తా కథనం ప్రచురితం అయిన అనంతరం కేసు నమోదు కాకుండా అనేక వత్తిల్లను ఎదుర్కొంటూ పోలీసులు సమాలోచనలు చేసుకొని ఎట్టకేలకు మారి కార్తీక్, కౌశిక్, తరుణ్, షరీఫ్ అనే యువకులతో పాటు మరికొంతమంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.