4 April, 2026 | 2:03 PM

Breaking News

క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •   నాటు సారా తాగి ముగ్గురు మృతి — సారా వల్లే మరణించారా ?   •   పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన   •  

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న యువకుల అరెస్టు

11-10-2025 10:29 PM

100 గ్రాముల గంజాయి స్వాధీనం..

మందమర్రి (విజయక్రాంతి): నిషేధిత మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని పట్టణ ఎస్సై ఎస్ రాజశేఖర్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముగ్గురు యువకులు కాగజ్ నగర్ నుండి గంజాయిని అక్రమంగా తీసుకువస్తున్నారని అందిన సమాచారం మేరకు, తమ సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించగా హోండా డియో స్కూటీపై ముగ్గురు వ్యక్తులు వస్తుండగా అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీ చేయగా 100 గ్రాముల ఎండు గంజాయి లభించిందని, గంజాయిని స్వాధీనం చేసుకుని గంజాయిని తరలిస్తున్న మండలంలోని పొన్నారం గ్రామానికి చెందిన ఏల్పుల వర్శిత్, అదిలపేటకు చెందిన వేల్పుల రాహుల్, నస్పూర్ కు చెందిన ఐత మనిదీప్ లను అరెస్ట్ చేశామని తెలిపారు.

నిందితులు కాగజ్ నగర్ కి చెందిన వ్యక్తి నుండి గంజాయిని కొనుగోలు చేసి, ఈ ప్రాంతంలో అమ్మడానికి, వారి వ్యక్తిగత వినియోగానికి తీసుకొస్తుండగా పట్టుకున్నామన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు ఈ నేరాలకు పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నారని వివరించారు. కాగా గంజాయి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పట్టణ ఎస్ఐ రాజశేఖర్, హెడ్ కానిస్టేబుళ్లు రాము, రాజేశ్వరరావు, సయ్యద్ మహమ్మద్ లను బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అభినందించారు.