12-06-2025 12:16:47 AM
పినపాక, జూన్ 11 (విజయ క్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి మె చ్చ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం సిపిఎం పార్టీ పినపాక మండల కమిటీ సమావేశం కల్తి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జానంపేటలో జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పై పోరు తప్పదన్నారు. అలాగే రా ష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇస్తూ ఆ రు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గ్రా మాల్లోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. ఆదివాసి గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదని మండిపడ్డారు. గర్భిణీలను, అనారోగ్యం పాలైన స్త్రీలను మంచాలకు కట్టి హాస్పిటల్ కి తీ సుకువెళ్లే పరిస్థితి పినపాక మండలంలో నేటికీ ఉందన్నారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు.సీఎం రేవంత్ రెడ్డి జి ల్లా రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు కనకయ్య, జిల్లా కమిటీ సభ్యులు ని మ్మల వెంకన్న, పార్టీ మండల కార్యదర్శి దుబ్బా గోవర్ధన్, కార్యదర్శి వర్గ సభ్యులు మడివి రమేష్, దడిగల వెంకన్న, నట్టి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.