calender_icon.png 8 January, 2026 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖనిలో క్యాత్ లాబ్

07-01-2026 01:31:10 AM

  1.   75 రోజుల్లో ప్రారంభిస్తాం
  2. సింగరేణి దవాఖానల్లో మార్చి నాటికి డాక్టర్లు, సిబ్బంది ఖాళీల భర్తీ
  3. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
  4. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): గోదావరిఖనిలో క్యాత్ లాబ్ నిర్మా ణం పీపీపీ మోడల్‌లో చేపడుతున్నామని, కాంట్రాక్ట్ అవార్డు కూడా పూర్తయిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దీనిని 75 రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీలో సింగరేణిపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యు లు అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. సింగరేణి పరిధిలోని ప్రాం తీయ దవాఖానల్లో పెండింగ్‌లో ఉన్న వైద్యు లు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను మార్చి నెలనాటికి పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పారు.

ప్రస్తుతం 11 మంది కాంట్రాక్ట్ డాక్టర్లు పనిచేస్తున్నారని 32 మంది డాక్టర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని, త్వరలోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. 176 పారామెడికల్ సిబ్బంది అంతర్గత నియామక ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడిం చారు. ఉద్యోగ విరమణ పొందినవారికి సింగరేణి ఆసుపత్రుల్లో మందుల సౌకర్యం కల్పిస్తున్నామని, సీపీఆర్‌ఎంఎస్ అందుబాటులో ఉన్నదని వెల్లడించారు.

రిటైర్డ్ ఉద్యోగులు రూ.8 లక్షల వరకు మందులను తీసుకునే అవకాశం కూడా కల్పించామని చెప్పారు. టెర్మినల్ బెనిఫిట్స్ కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. సింగరేణి పరిధి లోని ఖాళీ స్థలాల్లో ఉద్యోగ విరమణ పొందినవారికి ఇండ్ల నిర్మాణానికి స్థల కేటా యింపు అంశాన్ని బోర్డులో మాట్లాడి నిర్ణ యం తీసుకుంటామని చెప్పారు.

రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యం

ప్రజాప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. కార్మికుల భద్రతకు భరోసా కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం లేదా సింగరేణి సంస్థపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా కేవలం బ్యాంకుల ద్వారానే రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు. సింగ రేణిలో విజయవంతంగా అమలు చేస్తున్న ఈ బీమా పథకాన్ని, అదే తరహాలో విద్యుత్ శాఖలోని డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు.

సింగరేణిని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యం

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ సవాళ్ల మధ్య సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. కేంద్రం అను సరి స్తున్న నూతన విధానాల వల్ల రాష్ట్రంలోని బొగ్గు గనులను నేరుగా సింగరేణికి కేటాయించకుండా వేలం నిర్వహిస్తున్నారని, దీనివల్ల ప్రైవేట్ ఏజెన్సీలు రంగప్రవేశం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో వేలం ప్రక్రియలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి కొన్ని గనులను కోల్పోయిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిని స్వయంగా వేలంలో పాల్గొనేలా ప్రోత్సహించి కొన్ని బొగ్గు బావులను దక్కించుకునేలా చేశామని వెల్లడించారు.

ప్రస్తుతం మార్కెట్లో సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు ధర కంటే ప్రైవేట్ సంస్థలు తక్కువ ధరకే సరఫరా చేస్తున్నాయని, వినియోగదారులు సహజంగానే తక్కువ ధర ఎక్కడ ఉంటే అక్కడ కొనుగోలు చేస్తారని వివరించారు. ఈ పరిస్థితి సింగరే ణి బొగ్గు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నదని అన్నారు. సింగరేణి మనుగడ, కార్మి  కుల సంక్షేమానికి తీ సుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన పది రోజుల్లోగా సంస్థ పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీఎండీ, డైరెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.