23 May, 2026 | 6:39 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి

23-03-2026 05:06 PM

సర్పంచ్ మోర సంధ్యా భిక్షం

తుంగతుర్తి,(విజయక్రాంతి): పశుపోషకులు నిర్లక్ష్యం చేయకుండా పశువులకు టీకాలు వేయించాలని సర్పంచ్ మోర సంధ్య భిక్షం అన్నారు. సోమవారం మండల పరిధిలోని కరివిరాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ వ్యాధి సోకితే పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు గ్రామంలో 74  పశువులకు టీకాలు వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల  పశు వైద్యాధికారి డాక్టర్ ఆకుల నరేష్, సిబ్బంది రవి, శ్రీను, రైతులు పాల్గొన్నారు.