29-06-2025 12:35:03 AM
ఎమ్మెల్యే మదనమోహన్ చొరవతో సీసీ రోడ్డు ప్రారంభం
నాలుగో వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగం శ్రీనివాస్
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలోని నాలుగో వార్డ్ దేవునిపల్లి కాలనీలో ఎన్నో ఏళ్ల నుండి ఆ రహదారికి మోక్షం లభించలేదు. ఎమ్మెల్యే మదన్మోహన్ కృషి వల్ల ఆ కాలనీకి సిసి రోడ్డు రావడం కాలనీవాసులు ఎమ్మెల్యే మదన్మోహన్ పనుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆ వార్డులోని ఆ రోడ్డుతో ప్రజలకు కాలనీవాసులకు తీవ్ర అవస్థలు ఎదురైనప్పటికీ ఎమ్మెల్యే మదన్మోహన్ దృష్టికి రావడంతో వెంటనే సిసి రోడ్డు నిర్మించారని కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగం శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు దుంపల శంకర్ కంచం సిద్ధిరాములు నాయకులు సాయిబాబా శేఖర్ మాజీ ఎంపిటిసి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.