10-06-2025 07:37:09 PM
రామగిరి (విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోదరుడు యువ నాయకులు దుద్దిళ్ళ శ్రీను బాబు(Duddilla Srinu Babu)కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సెంటినరీ కాలనీలోని తెలంగాణ చౌరస్తాలో యువజ కాంగ్రెస్ నాయకులు మాజీ అసెంబ్లీ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోత్కూరీ అవినాష్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ బాణాసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శ్రీను బాబు నియామకానికి సహకరించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కెసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర నాయకత్వానిక రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ తరుపున ధన్యవాదాలు తెలిపారు.
రాబోయో రోజుల్లో దుద్దిళ్ల కుటుంబం మరెన్నో గొప్ప పదవులు అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తోట చంద్రయ్య, మాజీ జడ్పీటీసీ లు గంట వేంకట రమణ రెడ్డి, మైదం భారతి వరప్రసాద్, మాజీ ఎంపీపీ ఆరేళ్లి దేవక్క కొమురయ్య గౌడ్,నాయకులు దాసరి శివ, మాజీ ఎంపీటీసీ మూస్త్యాల శ్రీనివాస్, కాటం సత్యం, కొప్పుల గణపతి ,అట్ట తిరుపతిరెడ్డి ఆసం రాజు ,యువజన కాంగ్రెస్ నాయకులు బంకు మల్లేష్ మారకొండ సంతోష్ సిద్ధం మురళీకృష్ణ గుడిసెల సంతోష్, కన్నూరి శ్రీకాంత్, మట్ట రాజ్ కుమార్ కుంట చక్రి, ఆరెల్లి మహేందర్ ఇరుగురాళ్ల రమేష్, పంజాల రాకేష్ ,పర్శవేణ సమ్మయ్య, తిరుమల్, కెక్కర్ల స్వరూప వెంకటేష్, మల్లీశ్వరి,అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.