calender_icon.png 12 June, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతితో.. భూ సమస్యలకు చెక్

10-06-2025 07:40:02 PM

తహసీల్దార్ లాలూ నాయక్..

పెన్ పహాడ్: ఏండ్ల తరబడి ఉన్న భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి పథకం(Bhu Bharati Scheme) తీసుకువచ్చిందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ లాలూ నాయక్(Tehsildar Lalu Naik) అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంతో పాటు గాజుల మల్కాపురం గ్రామాలలో నిర్వహించిన భూభారతి రెవిన్యూ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయా భూ సమస్యలపై దరఖాస్తులను అందజేశారు. కాగా, పెన్ పహాడ్ లో 50, గాజుల మల్కాపురంలో 78  దరఖాస్తులను స్వీకరించినట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాధా ఆర్ఐ రంజిత్ రెడ్డి ఆయా గ్రామ రైతులు పాల్గొన్నారు.